మన్యం మీడియా/అశ్వారావుపేట నియోజక వర్గ ప్రతినిధి:: సమాజంలో కీలకపాత్ర వహిస్తున్న జర్నలిస్టుల యొక్క సాధక, బాధలను అర్థం చేసుకున్న మహనీయుడు, మానవతా దృక్పాధి అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్ రేగా కాంతారావు. సహృదయంతో ప్రకృతి వైపరీత్యాల వలన నివాసాన్ని కోల్పోయిన కొత్తగూడెం టౌన్ మన్యం మీడియా ప్రతినిధి చింతల చిరంజీవి కి అండగా నేనున్నానంటూ ధైర్యం చెప్పి, రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేసినందుకు కృతజ్ఞతగా స్వాతంత్ర దినోత్సవం నాడు కొత్తగూడెంలోని గెస్ట్ హౌస్ నందు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ( టియుడబ్ల్యూజే-హెచ్ 143) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూనియన్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కల్లొజీ శ్రీను,టెంజు అధ్యక్షులు వట్టికొండ రవి, సీనియర్ జర్నలిస్ట్ మోటమర్రి రామకృష్ణ, లక్ష్మణ్, షఫీ, ప్రభాకర్ రెడ్డి, కవటం శ్రీను, నరసింహారావు, కృష్ణంరాజు,అబ్జల్, సదానందం తదితర జర్నలిస్టులు ఉన్నారు.
Post A Comment: