CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అలవర్చుకోవాలి: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా

Share it:

 



మన్యం మనుగడ, పినపాక: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని గొట్టెళ్ళ గ్రామ సమీపంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, పినపాక మండల వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి సాగుచేస్తున్న వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. ఏడుపదుల వయసులోనూ వ్యవసాయాన్ని చేస్తున్న కంది సుబ్బారెడ్డి కృషి పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. యువ రైతులందరూ సుబ్బారెడ్డి ని ఆదర్శంగా తీసుకుని ఆధునిక వ్యవసాయ పరికరాలను వినియోగిస్తూ, వినూత్న ధోరణిలో వ్యవసాయం చేయాలని కోరారు. కంది సుబ్బారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో వినియోగిస్తున్న నూతన పరికరాలు పరిశీలించి, కొంత సమయం ఆహ్లాదకరంగా అక్కడ గడిపారు.

ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, , టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, సొసైటీ చైర్మన్ రవి శేఖర్ వర్మ, సొసైటీ వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, జానంపేట ఉప సర్పంచ్ రాయల సత్యనారాయణ, ఏడూళ్ల బయ్యారం టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ముల్లంగి వెంకటరెడ్డి, టిఆర్ఎస్ విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు యాంపాటి సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు...

Share it:

Post A Comment: