మన్యంటీవీ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట స్థానిక సాయి అంజనా బజాజ్ షోరూమ్ రెండవ వార్షికోత్సవ సందర్బంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన అశ్వారావుపేట ఎస్ఐ చల్ల అరుణ, నూతన బజాజ్ సీటీ 110 ఎక్స్ వాహనాన్ని ప్రారంబించారు. ఈ సందర్బంగా సాయి అంజనా బజాజ్ షోరూమ్ యజమాని సుధీర్ మాట్లాడుతూ తమ షోరూమ్ కి విచ్చేసే కస్టమర్లకు అనేక ఆఫర్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగా తమ కస్టమర్లు కు తొమ్మిది లీటర్ల పెట్రోల్ తో సహా కొన్న వాహనం పై హెల్మెంట్, ప్రతి వాహనం కొనుగోలుపై నాలుగు వేల రూపాయలు వరుకు తగ్గింపు ఉంటుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ స్టాఫ్ మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: