గుండాల ఆగస్టు 13 (మన్యం మనుగడ) గ్రామాల్లో దోమల నివారణ కార్యక్రమాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది చేపట్టారు. శుక్రవారం మండలం పరిధిలోని రోళ్ల గడ్డ, నర్సాపురం, దేవాల గూడెం, గ్రామాల్లో పంచాయతీ సిబ్బందితో కలిసి నీటి నిలువ ఉన్న ప్రదేశాల్లో చేప పిల్లలు వదిలి దోమల లార్వాలను సేకరించారు. అనంతరం వైద్యులు అన్వర్ అలీ మాట్లాడుతు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు. గ్రామాల్లో తమ ఇంటి చుట్టూ నీళ్ళు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ప్రతి వారం ఫ్రైడే , డ్రై డే కార్యక్రమం చేపట్టి గ్రామాల్లో ఉన్న వారందరికీ పరీక్షలు నిర్వహించి మందులను అందజేస్తున్న మన్నారు. వాటితో పాటు ఎవరైనా జ్వరంతో తో బాధపడుతున్నారని వివరాలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అలీ, సర్పంచ్ అజ్మీరా మోహన్, పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్, సి హెచ్ ఓ శ్రీహరి, మలేరియా టెక్నికల్ సూపర్వైజర్ సత్యం మరియు వైద్య సిబ్బంది పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు
Post A Comment: