CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కఠిన సేవకు దక్కిన కఠిన సేవా ప్రశంసా పత్రం

Share it:

 


 మత్తుపదార్థాల పై ఉక్కుపాదం. 

ఫ్రెండ్లీ పోలీస్ సేవా కార్యక్రమాలు. మారుమూల ప్రాంతం గిరిజనులకు వాటర్ ఫిల్టర్లు, దోమతెరలు పంపిణీ కార్యక్రమం 400 హెక్టార్ల అటవీ భూమి సంరక్షణ కు సహకారం.  

     మన్యం టీవీ, అశ్వాపురం: ఆయన ముఖంలో చెరగని చిరునవ్వు . అక్రమార్కులపై ఉక్కుపాదం . మన్యంలో సేవా కార్యక్రమాలు . వెరసి వరించిన ఉత్తమ కఠిన సేవా పథకం . ఆయనే అశ్వాపురం సిఐ సట్ల రాజు .స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అశ్వాపురం సీఐ సట్ల రాజు కు ప్రశంశ పత్రం జిల్లా కలెక్టర్ అనుదీప్, ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు,జిల్లా ఎస్పి సునీల్ దత్త్ చేతుల మీదగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. అటవీ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో సీ ఐ రాజుకు ప్రశంస పత్రాలు అందుకున్నారు.

అశ్వాపురం మండలంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో 400 హెక్టార్ల అటవీ భూమి సంరక్షణ కు అటవీ అధికారులకు సహకరించిన అశ్వాపురం సీ ఐ సట్ల రాజు కు డీ ఎఫ్ ఓ లక్ష్మణ్ రంజిత్ నాయక్ ఆధ్వర్యంలో ఉత్తమ సీ ఐ గా ప్రశంశ పత్రం అందుకున్నారు. అందరితో స్నేహపూర్వకంగా వ్యవహరించడం అక్రమార్కుల పట్ల కఠినంగా వ్యవహరించడం ఆయన నైజం. మండల వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు సైతం ముమ్మరంగా పాల్గొన్నారు. భావితరాలకు అడవుల ఆవశ్యకతను గమనించి ఫారెస్ట్ శాఖ వారికి తన సహాయ సహకారాలు అందించారు. ఈ సందర్భంగా మండల ప్రజలు సీఐ రాజుకు పథకాలు రావడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేయడంతోపాటు ప్రశంసిస్తున్నారు.

Share it:

Post A Comment: