చరిత్రలో చిరస్థాయిగా కెసిఆర్ పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది
అంబేద్కర్ ఆశయ సాధకుడు కెసిఆర్ కు దళిత జాతి రుణపడి ఉంటుంది
టి యం యం ములుగు జిల్లా అధ్యక్షులు కర్రీ శ్యాంబాబు
మన్యం టీవీ మంగపేట.
తెలంగాణ దళిత బంధు కెసిఆర్ ప్రారంభించి చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో చిరస్థాయిగా లిఖించి చరిత్రలో దళిత బంధుగా అంబేద్కర్ ఆశయ సాధకుడు గా నిలిచి పోయాడు. ఇది అభూత కల్పనో మాయ మార్మమో కాదు కండ్ల ఎదుట సాక్షాత్తు దళిత బిడ్డలకు కెసిఆర్ ఒక తండ్రి లాగా, ఒక పెద్ద అన్న లాగా ఇచ్చిన కానుక దళిత బంధు. దళిత బంధు కెసిఆర్ ప్రకటించిన కొన్ని రోజుల్లోనే దానిని ఆచరణలో పెట్టి అమలు పరచిన ఏకైక నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.స్వప్నించి సాకారం చేసిన దార్శనికుడు.తెలంగాణా దళిత బంధు ఒక్క తెలంగాణాకే కాకుండా, దేశానికి,ప్రపంచానికే ఆదర్శం. ఇటువంటి తెలంగాణా దళిత బంధు ప్రవేశ పెట్టి ప్రారంభించిన తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు దళిత జాతి యావత్ రుణ పడి ఉంటుంది అని ఈ సందర్బంగా ములుగు జిల్లా టి యం యం అధ్యక్షులు కర్రీ శ్యాంబాబు తెలియజేసారు.
Post A Comment: