గుండాల ఆగస్టు 5 (మన్యం మనుగడ) ఆదివాసి దినోత్సవాన్ని జయప్రదం చేయాలని తుడుం దెబ్బ, ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో రెండు సంఘాల నాయకులు సమావేశం నిర్వహించుకున్నారు. ఈ నెల 9న నిర్వహించే ఆదివాసి దినోత్సవానికి ఆదివాసీలు ప్రతి ఇంటి నుండి ఒకరు కదలిరావాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు కదలి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ నాయకులు మోకాళ్ళ కన్నయ్య , వజ్ర ఎర్రయ్య , పూనెం శ్రీను, ఏ ఎస్ పి చంద్రయ్య దొర, గోవింద నరసింహారావు గోవింద నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: