CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బాధిత మహిళలకు అండగా ఉషోదయ మండల సమైక్య జండర్ జిల్లా కమిటీ సభ్యురాలు సీతాకుమారి...

Share it:

 


మన్యం టీవీ : జూలూరుపాడు, ఆగస్టు 24, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల ఉషోదయ మండల సమైక్య జెండర్ కమిటీగా 2008 నుండి ఇప్పటి వరకు మహిళా మండలి సభ్యులు గా పనిచేస్తున్న సీత కుమారి మాట్లాడుతూ.. ఇప్పుడు వరకు మండలంలో సుమారు 500కు పైగా కేసులు పరిష్కారం చేశామని, బాల్య వివాహాలు అడ్డుకోవడం వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం, భార్యాభర్తల సమస్యలను పరిష్కరించడం మరియు భూ సమస్యలను పరిష్కారం చేయడం జరిగిందని, అన్నారు. జూలూరుపాడు మండలం లో ఆడ వారికి అండగా ఉంటామని ఎక్కడ ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి మా వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా కమిటీలోని సభ్యులు అయినా మొదుగు కమలమ్మ కు 60 సం' నిండిన సందర్భంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మంలో జండర్ జిల్లా కమిటీ సభ్యురాలు సీతాకుమారి, ముస్లిం మైనార్టీ సభ్యురాలు షేక్ పరీనా, మల్లేశ్వరి,సత్యవతి,ధనమ్మ, సరోజిని పాల్గొన్నారు.

Share it:

Post A Comment: