CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బి సి బందు ప్రకటించి ప్రభుత్వం నైతికతను చాటుకోవాలి

Share it:



జాతీయ బీసీ సంక్షేమ సంఘం ములుగు జిల్లా కన్వీనర్ సంద బాబు

మన్యం టీవీ మంగపేట.


వెనుకబడిన తరగతుల కులాలకు సైతం బిసి బందు ప్రకటించి వారి సంక్షేమాన్ని కోరుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ములుగు జిల్లా కన్వీనర్ సంద బాబు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వెనుకబడిన తరగతుల ప్రజలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, అన్నిరంగాలలో వెనుకబడి ఉన్నారని సమగ్ర కుటుంబ సర్వే తేటతెల్లం చేసినప్పటికీ, బీసీల సంక్షేమం వైపు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం విడ్డూరమని అన్నారు. కులవృత్తులను వంశపారంపర్యంగా నమ్ముకొని దుర్భర జీవితాలను గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు రాష్ట్రంలో ఉన్న బీసీల పట్ల వివక్ష చూపించి పేదరికంలోనే మగ్గేలా చేయడం ప్రభుత్వ కుటిల నీతికి నిదర్శనమని అన్నారు. బీసీల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే ప్రభుత్వం దళిత బంధు మాదిరిగా బిసి బందును ప్రకటించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

Share it:

Post A Comment: