మన్యం టీవీ పాల్వంచ:-
ఇటీవలే అకస్మాత్తుగా మృతిచెందిన ఆదివాసీ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మరియు హైకోర్టు న్యాయవాది కణితి.లక్ష్మణ్ రావు మృతి తీరనిలోటు అని మృతి పట్ల బాధాకరమైన విషయం మని ఆదివాసీ సేన జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ టౌన్ లోని కుమ్రంభీం మీటింగ్ హాల్ నందు లక్ష్మణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిoచారు. ఆదివాసి ముద్దుబిడ్డ హక్కుల సాధకుడు నిత్యం ఆదివాసి పరిశోధకుడు లక్ష్మణరావు ప్రస్తుతం లేకపోవడం బాధాకరమని అన్నారు.ఆదివాసి ఇజం అని ముందుకు సాగి తెలంగాణ రాష్ట్రంలోకి పోరాటం సాగించి అమలుకు కృషి చేశారు.జీవో నెంబర 3 అమలుచేసి పంచాయతీ సెక్రెటరీ ఉద్యోగ సాధనకు ఇప్పించిన మహా ఘనుడు అనునిత్యం ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి స్వయంపాలన సాధ్యమవుతుందని,ఆదివాసీ సేన ఆశయాలు సిద్ధాంతాలు ముందుకు తీసుకువెళుతూ అంతిమంగా లక్ష్మణరావు కోరిక అమలుకై పోరాటం సాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ మండల అధ్యక్షులు కాక.సురేష్, శ్రీను,పెద్దిరాజు, వసంతరావు, కుంజా.ప్రసాద్, కొమరం.అనిల్ కుమార్,సాంబశివరావు, వాసుదేవరాజ్, జ్యోతి సరితా, సంజీవరావు,నరేష్ సాయిరాం, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: