మన్యం టీవీ: జూలూరుపాడు, ఆగస్టు 24, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలంలోని పలు పంచాయతీలలో అభివృద్ధి పనులను, మంగళవారం నాడు వైరా శాసనసభ్యులు రాములు నాయక్ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. వివరాలు...ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ క్రింద పలు అభివృద్ధి పనులను మండలంలోని గురువాగు తండా,బోజ్యా తండా,వెంగన్న పాలెం,అన్నారపాడు,జూలూరుపాడు పంచాయతీల లో సుమారుగా 28 సిసి రోడ్లను మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలను ఒక కోటి ఇరువై లక్షల విలువగల పనులను ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలంలో మరిఎన్నో అభివృద్ధి పనులను ప్ప్రారంభించేందుకు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు చౌడం నర్సింహారావు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు లేళ్ల వెంకట్ రెడ్డి,ఎంపిపి లావుడియా సోనీ,భోజ్యా తండా సర్పంచ్ కిషన్ లాల్, అన్నరపాడు సర్పంచ్ పద్మ,వెంగన్నపాలెం సర్పంచ్ గలిగె సావిత్రి, జూలూరుపాడు సర్పంచ్ మల్కం విక్రమ్,ఎంపిటిసిలు దుద్దుకూరి మధుసూదన్ రావు, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు,కార్యకర్తలు మరియు మండల అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: