భూ నిర్వాసితులు రేగా అభయం
👉అదనంగా మరో 7 ఉద్యోగాలు
👉విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు
🙏కొత్త దామోదర్ గౌడ్
మన్యం మనుగడ జిల్లా ప్రతినిధి:
అధైర్య పడకండి ,అండగా ఉంటాను... మీ కొడుకుగా..ఓ అన్నగా మీకు ఉద్యోగాలు ఇప్పిచ్చే బాధ్యత నూరు శాతం నేనే తీసుకుంటున్నాను. విప్ రేగా కాంతారావు భూనిర్వాసితుల అన్న మాటలు. వివిధ కారణాల చేత భూమి కోల్పోయిన 39 మంది భూనిర్వాసితులకు సంబంధించి ఉద్యోగ నియామక పత్రాలు అందించలేదు.దీని తో వారు ఆవేదనకు గురయ్యారు. ఈ విషయం రేగా కాంత రావు దృష్టికి రావడంతో ఆయన స్పందించి 39 మందికి ఖచ్చితంగా ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఏ ఒక్కరు కూడా అధైర్య పడవద్దని వారికి భరోసా కల్పించారు. అదేవిధంగా ఇంటెక్ వెల్ మూలంగా భూమి కోల్పోయిన 7 నిర్వాసితులకు సైతం ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేశారు. ఈ సందర్భంగా వారు రేగా కాంతారావు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Post A Comment: