CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రేగాను విమమర్శిస్తే మూల్యం చెల్లించక తప్పదు

Share it:

 


మన్యం మనుగడ, మణుగూరు:

విప్ ,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ని విమర్శించే స్థాయి మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదని మణుగూరు కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా అన్నారు. 2009 నుంచి ఇప్పటి వరకు కూడా కార్యకర్తలను కంటికి రెప్పలా గా కాపాడుకుంటూ నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయంగా పని చేస్తూ కొన్ని వందల కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేస్తున్నా, మీకు కళ్ళు కనపడటం లేదా అని మండి పడ్డారు. రేగాకాంతా రావు ని విమర్శించే ముందు మీ గురి గురి గింజ సామెత గుర్తు తెచ్చుకోండి. మండలానికి ముగ్గురు తయారయ్యారు.ఎవరెవరు బతుకులు మాకు తెలుసు. బ్యాంకు దొంగతనాలు, ఇసుక ట్రాక్టర్ ల దగ్గర 100 రూపాయలు చందాలు అడగడం, స్టోర్లో దగ్గరికి వెళ్లి బ్లాక్మెయిల్ చేయడం గుప్తనిధుల తవ్వకాలు ఈ చిల్లర రాజకీయాలు చేసే మీరు మా రేగా అన్న ముందు కాలి గోటికి కూడా సరిపోరు అని అన్నారు. పినపాక నియోజకవర్గ ప్రజలకు కరోనా కాలంలో వందల క్వింటాళ్ల బియ్యం ఇచ్చి రేగా చిరస్థాయిగా నిలిచిపోయారని, ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకోవలన్నారు. పేదల పెన్నిధి, పినపాక నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత రేగన్న జోలికొస్తే బుద్ధి చెప్పుతాం అని హెచ్చరించారు.

Share it:

Post A Comment: