. మన్యం టీవీ, అశ్వాపురం: పిల్లల ప్రవర్తన అలవాట్లను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ వుండాలని సీ.ఐ సట్ల రాజు తల్లిదండ్రులకు సూచించారు.
*యువత మత్తు పదార్థాలకు బానిసలు కావడం ద్వారా తమ బంగారు భవిష్యత్తును కోల్పోవడం జరుగుతుందని యువత జీవితాన్ని సీరియస్ గా తీసుకోని ఉన్నత స్థాయికి ఎదుగేందుకు కృషి చేయాలి తప్ప మత్తుకు బానిసలు కావద్దన్నారు. మత్తుకు బానిసలుగా తయారు కావద్దని, ప్రతి యువకుడు ఓ మంచి పౌరుడిగా గుర్తించబడాలని,సీ.ఐ రాజు యువతను పిలుపునిచ్చారు *యువత మత్తు పదార్థాలకు అలవాటు పడటం ద్వారా వ్యక్తిగతంగా నష్టపోవడంతో పాటు, ఈ సమాజానికి ప్రమాదకరంగా మారడమే కాకుండా, నేరాలకు కూడా పాల్పడుతున్నారు. చట్టప్రకారం *యువత పై కేసులు నమోదు అయితే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత వుండదు,మత్తు పదార్థాలను సేవించే వారు వాటి నుండి బయటపడాలని తెలిపారు మంచి కోసం యువతకు పోలీసుల పూర్తి సహసహాకారం ఎప్పుడు ఉంటుందని సూచించారు . పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల నిఘా కూడా తప్పనిసరి అని సీ.ఐ సట్లరాజు తెలిపారు.
Post A Comment: