మన్యం మనుగడ, కరకగూడెం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం లోని డంపింగ్ యార్డులను పరిశీలించుటకు వచ్చిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ అక్కడికి దగ్గరలో పొలంలో నాటు వేస్తున్న వ్యవసాయ కూలీల దగ్గరికి వెళ్లి కాసేపు వారితో ముచ్చటించి, కూలీల సాధకబాధకాలను తెలుసుకుని, అలా వారితో కాసేపు నాటు వేసి అందరిని మురిపించారు. నాటు వేయడం చూడటమే గాని, ఎప్పుడూ ఇలా చేయలేదని, ఈ పర్యటన సందర్భంగా ఈ అవకాశం రావడం సంతోషంగా భావిస్తున్నానని కూలీలతో అన్నారు. తమతో పాటు కలిసి నాటు వేసిన కలెక్టర్ అనుదీప్ తో కూలీలు మాట్లాడుతూ, ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ కూలీల తోముచ్చటిస్తూ నాటు వేయడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు.
Post A Comment: