మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లో ఆదివాసీ గ్రామాలయిన,విప్పలగుంపు, చింతలపాడు కు చెందిన 7గురు గుత్తికోయలు అడవి జంతువు అయిన కనుజుని బాణాలతో వేటాడుకుంటూ, గోపాలరావుపేట సమీపంలోని పొలాలలో కి తరుముకుంటూ వచ్చారని, బాణాలు తగలడంతో గాయాలపాలైన జంతువు పొలాల్లో కొట్టుకొని మరణించిందని, అటుగా వెళ్ళిన కొందరు రైతులు చూసి అటవీశాఖ అధికారులకు తెలిపారు. విషయం తెలుసుకున్న ఏడూళ్ల బయ్యారం అటవీ క్షేత్ర అధికారి కె. తేజస్వి తన సిబ్బందితో
ఘటనా స్థలానికి చేరుకొని, అడవి జంతువుకి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం కి తరలించారు. ఈ విషయమై పోస్టుమార్టం నిర్వహించుటకు పశువైద్యాధికారి అందుబాటులో లేరని, ఆ కార్యక్రమాన్ని మరుసటి రోజుకు వాయిదా వేశామని, నిందితులలో ఒకరు మాత్రమే ఘటనా స్థలంలో
దొరికారని, అటవీ క్షేత్ర అధికారి తేజస్వి తెలిపారు.
Post A Comment: