మన్యం టీవీ దుమ్ముగూడెం: నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోగల కొత్త దంతేనం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఇటీవల ఈ గ్రామంలో లో వైరల్ ఫీవర్ ఎక్కువగా రావడంతో హెల్త్ క్యాంపు నిర్వహించారు నర్సాపురం వైద్యాధికారి డాక్టర్ చైతన్య మాట్లాడుత గ్రామంలో జ్వరాలు ప్రబలకుండా ప్రజలకి కి ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని దోమతెరలు వాడుకోవాలని సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు జ్వరం దగ్గు జలుబు ఒంటినొప్పులు ఉంటే కనుక కోవిడ్-19 పరీక్ష తప్పక చేయించుకోగలరు అని తెలియజేశారు .జ్వరంతో బాధపడుతున్న పదిమంది రక్తపరీక్షలు చేయించారు ఒక వైద్య శిబిరంలో పారామెడికల్ సిబ్బంది పూర్ణ ,ఆశ వర్కర్లు ,కుమారి, లక్ష్మి, కృష్ణవేణి ,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: