మన్యం మనుగడ, పినపాక:
జిల్లా కేంద్ర సహకార బ్యాంక్, నాబార్డ్ సౌజన్యంతో ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమంను సహకార సంఘ కార్యాలయంలో ఏర్పరిచారు. దీనిలో భాగంగా కళాజాతర బుర్ర కథల ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. ప్రస్తుత కాలంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా డిజిటల్ లావాదేవీలపై రైతులకు అవగాహన కల్పించారు . సైబర్ క్రైమ్ బారిన పడకుండా తప్పించుకోవడానికి సూచనలు సలహాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో నాబార్డ్ ఎఫ్ ఎల్ సి వెంకటేశ్వర్లు,డిసిసిబి మేనేజర్ నందన్, సొసైటీ డైరెక్టర్ రవి వర్మ, సీఈవో, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు
Post A Comment: