మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏమ్మార్పి ఎస్ నాయకులు గుగ్గిళ్ల సురేష్ మాదిగ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడo జరిగింది. దళితబంధు పథకం ఆగస్టు 15 లోగా హుజురాబాద్ లో అమలు చేయాలని ఈ నెల 31 తరికు లోగా తెలంగాణ రాష్ట్ర మంతట అమలు చేశి 20 నుండి 25 లక్షల దళిత కుటుంబాలకు కుటుంబానికి 10 లక్షల చొప్పున ఇవ్వాలని ఈ సందర్బంగా సురేష్ గుగ్గిళ్లఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరిగింది. మంగపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షను ప్రారంభం చేయడం జరిగింది ఎమ్మార్పీస్ మంగపేట మండల ఇంచార్జి గుగ్గిళ్ల సురేష్ మాదిగ మంగపేట అధ్యక్షతన ఆందోళన చేపట్టడం జరిగింది.ఈ దీక్షలకు ముఖ్యఅతిదిగా ఎమ్మార్పీస్ వరంగల్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంద రాజు మాదిగ మరియు మడిపెళ్లి శ్యామ్ మాదిగ హాజరై ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ దళిత బందు పథకాన్ని మరో మోసపూరిత పధకంగా మార్చ వద్దని ఈ సందర్బంగా కోరారు. ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో దళిత కుటుంబాలు ఎమ్మార్పీస్,మాల మహానాడు,బుడుగ జంగాలు, సింధు హక్కుల పోరాట సమితి ఇతర కులాల ప్రజలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పి ఎస్ గ్రామ అధ్యక్షులు గుండెట్టి జంపయ్య,లంజపెళ్లి పున్నారావు, ఎల్లందసరి శ్రీను,ఇసంపెళ్లి కృష్ణ, లంజపెళ్లి ఆదినారాయణ, చిపనపెల్లి రాములు, లంజపెళ్లి గంగమ్మ,వంగురి పొసమ్మ కాట ఆదిలక్ష్మి,కొలుకుల సత్యమ్మ, లంజపెళ్లి లాలయ్య, నాగయ్య, తదితరులు రిలే నిరాహారదీక్ష లో పాలుకొన్నారు. ఈ కార్యక్రమంనకు గుగ్గిళ్ల సురేష్ మాదిగ అధ్యక్షత వహించారు.
Post A Comment: