ప్రత్యేక చొరవ చూపిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు
మన్యం మనుగడ, పినపాక :
మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన భాధిత కుటుంబాలకు బుధవారం ఏడూళ్లబయ్యారం క్రాస్రోడ్లో గల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఎంపీపీ గుమ్మడి గాంధీ ఆధ్వర్యంలో పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేయడం జరిగింది. ఆయనతోపాటు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ఆత్మ చైర్మన్ పొనుగోటి భధ్రయ్య, సొసైటీ చైర్మన్ రవివర్మల చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, డైరెక్టర్ కొండేరు రాము, టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ముక్కు వెంకటేశ్వరరెడ్డి, వారా నర్సింహారావు, ముక్కు నాసర్రెడ్డి, నగేష్ ,ఉప సర్పంచ్లు కొండేరు నాగభూషణం, మునిగెల సంతోష్, పినపాక మండల తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు యాంపాటి సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: