CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు ఓ సి-2 ప్రమాదానికి సింగరేణి అధికారులు బాధ్యత వహించాలి:సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి ఏరియా ఓసి 2 లో జరిగిన ప్రమాదానికి సింగరేణి అధికారులే బాధ్యత వహించాలని,సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కార్యదర్శి మోర రవి అన్నారు.ఓసి ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.సింగరేణి అధికారులు లాభాల కోసం టార్గెట్లు పెట్టి పని చేపిస్తున్నారు,తప్ప కార్మికుల రక్షణ చర్యలపై దృష్టి పెట్టడం లేదన్నారు. ఔట్సోర్సింగ్ కార్మికుల విషయంలో సింగరేణి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. మృతి చెందిన కుటుంబాల కు 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కుటుంబంలో ఒకరికి సింగరేణిలో ఉద్యోగం కల్పించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యదర్శి మోర.రవి డిమాండ్ చేశారు.

Share it:

Post A Comment: