మన్యం మనుగడ, మణుగూరు:
స్థానిక రాజీవ్ గాంధీ నగర్ లో గల శ్రీ విద్యా హై స్కూల్ నందు 2020 21 టెన్త్ క్లాస్ పాస్ అయి పాలీసెట్ లో1228 ర్యాంకు సాధించిన గంగిశెట్టి పవిత్ర D/o శ్రీనివాస్ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ బాసర నందు త్రిబుల్ ఐటీ సీటు సాధించినది కరోనా పాండమిక్ లో కూడా కష్టపడి సీటు సాధించిన పవిత్రను శ్రీవిద్య విద్యాసంస్థల డైరెక్టర్ నూకారపు రమేష్ ఆధ్వర్యంలో శ్రీ విద్యా హై స్కూల్ ప్రాంగణంలో అభినందించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని మరలా ఈ శ్రీవిద్య స్కూల్ ప్రాంగణంలోనే అభినందించిన చేతులతోనే సన్మానించి కోవాలని శ్రీవిద్యా విద్యాసంస్థల డైరెక్టర్ నూకారపు రమేష్ మాట్లాడినారు ఈ కార్యక్రమంలో పవిత్ర కుటుంబ సభ్యులు శ్రీ విద్యా హై స్కూల్ ప్రిన్సిపాల్ ప్రభు కిరణ్ రాజ్ ఇన్చార్జిలు కె వాణి బి నిహారిక పాల్గొని అభినందించారు.
Post A Comment: