మన్యం టీవీ ఏటూరు నాగారం
మహబూబాబాద్ జిల్లా గంగారాం(ములుగు నియోజకవర్గం)మండల పలు అభివృద్ధి పనుల గురించి విన్నపాలు తెలపడానికి మండల అధ్యక్షులు ఈసం సమ్మయ్య ఆధ్వర్యంలో బయల్దేరి ములుగు జిల్లా పరిషత్తు కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కుసుమ జగదీష్ ను కలవడానికి బయలుదేరి వస్తున్నారు.ఈ క్రమంలో ఉదయం నుండి సాయంత్రం వరకు పలు మండలాల్లో పనులు ముగించుకొని తిరుగు ప్రయాణం అయిన జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్
వాహన శ్రేణి మార్గం మధ్యలో గంగారాం వారికి తారసపడగానే వెంటే వాహనం అపి రోడ్డు పక్కన కూర్చొని గంగారాం మండల అభివృద్ధి పనుల వివరాలు తీసుకున్నారు.అభివృద్ధి పనుల కోసం అనగానే వెను వెంటనే ఏమి శాంతి భద్రతల గురించి ఆలోచన చేయకుండా రోడ్డు పైన రచ్చ బండ వాలే సమస్యలను స్వీకరించారు. అని గంగారాం మండల తెరాస శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.
Post A Comment: