CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో పోడు యాత్ర

Share it:

 


👉◆ పోడు భూమి కోసం పొలికేక

👉 ◆ ఉంటే పోడు భూమిలో లేకపోతే జైల్లో

👉 ◆ ఆగదు పోరాటం భూమి దక్కే దాక.

👉◆ ఒక్క ఎకరం పోడు కూడా వదులు కొం...

మన్యం మీడియా/అశ్వారావుపేట నియోజక వర్గ ప్రతినిధి:: ములకలపల్లి మండలం, గుట్టగూడెం గ్రామానికి చేరుకున్న సీపీఐ పార్టీ పోడు యాత్ర.

ఘన స్వాగతం పలికిన సిపిఐ పార్టీ కార్యకర్తలు, పోడు సాగుదారులు. గిరిజనులు.ములకలపల్లి మండలంలోని పోడు సాగుదారుల సమస్యలు పరిష్కరించాలని, సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభించిన పొడు యాత్ర ములకలపల్లి మండలం, గుట్టగూడెం గ్రామానికి చేరుకుంది.ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డితో పోడు సాగుదారులు, వారి గోడు వెళ్ల బోసుకున్నారు.చాడ  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు ధమన కాండ నిర్వహిస్తూ, పోడు సాగుదారులను బయ బ్రాంతులకు గురి చేస్తుంది అన్నారు. ఉంటే భూమిలో ఉంటాం లేకపోతే జైలు కైనా వెళ్తాం, అంతే తప్ప ఒక్క ఎకరం పోడు భూమి కూడా వధులుకోమని,పోడు భూముల జోలికి వస్తే చూస్తూ ఊరుకోం అని అన్నారు. సీపీఐ పార్టీ పోడు భూములకు అండగా ఉంటుందని అన్నారు.పోడు యాత్రకు కాంగ్రెస్ పార్టీ ములకలపల్లి మండల అధ్యక్షులు పెటేటి నరసింహరావు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కునంనేని సాంబశివరావు, సిపిఐ పార్టీ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంత్ రావు, బాల మల్లేష్, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి రామవత్ అంజయ్య నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట అధ్యక్ష కార్యదర్శులు కాంతయ్య, తాటి వెంకటేశ్వర్లు, సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు నరటి ప్రసాద్ , శ్రీనివాస్ రెడ్డి, సీపీఐ పార్టీ ములకలపల్లి మండల కార్యదర్శి చిట్టి బాబు, నరాటి రమేష్, కొర్రీ భద్రం, జబ్బార్, గజ్జల సందీప్, కిసరి గంగరాజు, గడ్డం వెంకటేశ్వర్లు,వెంకటరెడ్డి,వీరునాయక్, అనుముల సాయి, నకిరకంటి పుల్లారావు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: