మన్యంటీవీ, అశ్వారావుపేట:
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో క్రీడలలో అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వడం జరిగేది. ఆ అవార్డు పేరు మార్చుతూ నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఎంపీటీసీ భారతి (జూనియర్ సీతక్క) పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ను ఇకపై మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు గా పేరుమార్చి దేశ ప్రజల మనోభావాలు గాయపరిచారు అని చెప్పడం జరిగింది. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పేరు మీదుగా క్రీడలలో అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఈ అవార్డును ప్రవేశపెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రాచుర్యం పొందిన పథకాలు పేరుమార్చి బిజెపి ప్రభుత్వం లబ్ధి పొందాలని చూస్తుంది అని ఆమె తెలియజేశారు. ఇటువంటి వాటిని ప్రజలందరూ గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: