ఎంపీడీవో బాలమణి
గుండాల ఆగస్టు 19 (మన్యం మనుగడ) పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని ఎంపీడీవో బాలామణి అన్నారు. గురువారం గుండాల ఎస్సీ కాలనీ, రోళ్ల గడ్డ గ్రామాల్లో నిర్వహించిన హెల్త్ క్యాంపులను ఆమె డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా ఆమె సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు. ఇంటి చుట్టూ గ్రామాల్లో నీళ్లు నిలవ ఉండకుండా చూసుకోవాలన్నారు. నీళ్ళు నిల్వ ఉన్నచోట తియెూ పాస్ ద్రావకాన్ని పిచికారి చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందించిన దోమ తెరలను వాడాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి చంద్, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్, వట్టం సురేష్ , శ్రీహరి, మలేరియా టెక్నికల్ సూపర్వైజర్ సత్యం, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: