టింబర్ డిపో నుండి కర్ర కొనుగోలు చేసిన పనులు చేసుకొని ఇవ్వట్లేదు గుండాల ఎంపీటీసీ సంధాని
గుండాల ఆగస్టు 19 (మన్యం మనుగడ) అటవీశాఖ అధికారుల తీరు మారాలని గుండాల ఎంపీటీసీ సంధాని అన్నారు. గురువారం మండల మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతు టింబర్ డిపో లలో కొనుగోలు చేసిన కలపతోనే కార్పెంటర్స్ పనులు చేస్తుంటే అడ్డగించి పనులను ఆపి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారిని ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. రక్షణ వే వారికి అనుమతులు ఇచ్చి పనులను చేసుకునే విధంగా చూడాలని ఉన్నత అధికారులను ఆయన కోరారు
Post A Comment: