*డి వై ఎఫ్ ఐ
*ఆధ్వర్యంలో మంగపేట మండలం లోని కొన్ని గ్రామాలు సందర్శన
*ములుగు జిల్లా మంగపేట మండలం లో
*నాణ్యత లేని భవనాలు
మన్యం టీవీ మంగపేట.
మండలంలోని ప్రభుత్వ బిల్డింగులు నాణ్యత లేకుండా కట్టారని ఈ సందర్బంగా డి వై ఎఫ్ ఐ నాయకులు అన్నారు.
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ మంగపేట మండలం నాయకులు ఇందారపు రమేష్ మాట్లాడుతూ కొన్ని గ్రామాలలో, రాజుపేట ఎస్సి కాలనీ, దొమెడ ,రమణక్కపేట, కన్నాయిగూడెం ,బాలన్న గూడెం సర్వే చేయడం జరిగింది బిల్డింగులు ఎప్పుడు కూలి పోతాయో తెలియదని ఆయన మండిపడ్డారు
భవనానికి మధ్యలో నెర్రలు బాసి ఉండటం వల్ల నాణ్యతలేని కట్టుబడులు కడుతున్నారు నామమాత్రపు కట్టుబడుల ద్వార నష్టం వాటిల్లుతుంది
అదేవిధంగా ప్రభుత్వ అధికారులు స్పందించి జరిగే అన్యాయాల పైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.మరి కాంట్రాక్టర్ యాజమాన్యం కుమ్మక్కై గ్రామ ప్రజలకు నష్టం కలిగే పనులు చేస్తున్నారని వారు వాపోయారు. పనులు ప్రారంభించిన అప్పటినుండి యాజమాన్యం ఇప్పటి వరకు పర్యవేక్షణ చేయలేదు ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ యొక్క కాంట్రాక్టర్ ను యాజమాన్యం పై చర్యలు తీసుకొని గ్రామ ప్రజలు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు లేనియెడల డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేపడతామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు వెంకటేష్, సాయి కుమార్ ,తిరుపతి, అంజి బాబు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: