మన్యం టీవీ ప్రతినిధి: మండలంలోని అంగన్వాడీ కేంద్రాలకు ఆర్టీసీ ప్రవేశపెట్టిన కార్గో సర్వీసు ద్వారా సరుకులు చేరుతున్నాయి. శుక్రవారం జిల్లా కేంద్రం నుండి కార్గో వాహనంలో వచ్చిన సరుకులను అంగన్వాడీ కేంద్రంలో టీచర్ల పర్యవేక్షణలో దించుకున్నారు. ఆర్టీసీని లాభాల బాటలో పట్టించేందుకు,ఆదాయ మార్గాలను సృష్టించుకునే పనిలో భాగంగా అంగన్వాడి సరుకులను కేంద్రాలకు నేరుగా కార్గో సర్వీస్ ద్వారా అందించే కార్యక్రమం చేపట్టడం పట్ల ప్రభుత్వానికి సర్వత్ర అభినందనలు వ్యక్తం చేస్తున్నారు
Post A Comment: