మన్యం టీవీ పాల్వంచ :-
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ అధినేతగా తెలంగాణ రాష్ట్ర సాధనలో తను ముందుండి ఉద్యమాన్ని నడిపి తెలంగాణను సాధించిన మహోన్నత వ్యక్తి జయశంకర్ సార్ అని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్బంగా కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్రావు నాయకత్వం లో పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు మంతపురి రాజూగౌడ్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం స్థానిక దమ్మపేట సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జయశంకర్ సార్ చిత్రపటానికి కొత్వాల పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.స్వీట్లు పంచి పెట్టారు. ఈ సందర్బంగా కొత్వాల మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సృష్టికర్తగా తెలంగాణ రాజకీయ సమస్య మాత్రమే కాదు అది సామాజిక ఆర్థిక సమస్య అని చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి జయశంకర్ అని కొనియాడారు.తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ధైర్యంతో చివరివరకు శ్రమించిన పోరాట యోధుడు అన్నారు. ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త జయశంకర్ సార్ ఆశయాల సాధనకు కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజుగౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్, ఆత్మకమిటీ డైరక్టర్ కాల్వ ప్రకాశ్ రావు,టిఆర్ఎస్ నాయకులు మహీపతి రామలింగం,యస్వి.ఆర్కె ఆచార్యులు, కాల్వ భాస్కర్, బేతంశెట్టి విజయ్, చింత నాగరాజు, కందుకూరు రాము,దారా చిరంజీవి, హర్షవర్ధన్, సంతోష్ రెడ్డి(బబ్లు) తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: