మన్యం టీవి,టేకులపల్లి:
ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ గిరిజన ఇతర పేదలు నాలుగు దశాబ్దాలుగా సాగు చేసుకునే భూములను ఆక్రమిస్తే వారికి బతుకు లేకుండా నిరాశ్రయులు అవుతారని తక్షణమే ఆదివాసి భూముల ఆక్రమణలు నిలుపుదల చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ సహాయ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు పిడిఎస్యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కాంపాటి పృథ్వి, తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షులు మంతిన సంజీవరావు కాంగ్రెస్ నాయకులు రెడ్యానాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరారం లో ప్రారంభమైన పాదయాత్ర టేకులపల్లి కి చేరుకున్న సందర్భంగా జరిగిన కార్యక్రమానికి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసి మండల కార్యదర్శి కల్తీ వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా వారు పాల్గొని మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని ప్రాణాలర్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే నేడు నీళ్లు నిధులు నియామకాలు కేటాయించకుండా ఆదివాసి ల భూములను ఆక్రమించుకున్నారు.
Post A Comment: