మన్యం టీవీ చర్ల: చర్ల మండలం గుంపెన గూడెం గ్రామం వద్ద ఆర్టిసి బస్సు చింత చెట్టును ఢీకొట్టింది. వివరాల్లోకి వెళితే వెంకటాపురం నుంచి భద్రాచలం వెళుతున్న ఆర్టిసి బస్సు చర్ల గుంపెన గూడెంగ్రామం వద్ద డ్రైవర్ నిర్లక్ష్యం వలన అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చింత చెట్టుకు ఢీ కొట్టడం జరిగింది. బస్సులో ఉన్న ప్రయాణికులు కి గాయాలు మాత్రమే అయ్యాయి ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అధిక వర్షం కారణంగా మరియు డ్రైవర్ నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని బస్సులోని ప్రయాణికులు చెబుతున్నారు. గాయపడ్డ వారిని చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించడం జరిగింది.
Post A Comment: