CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గోఆధారిత వ్యవసాయం

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

మండలంలోని కమలాపురంలో తన స్వంత వ్యవసాయ క్షేత్రంలో  గో ఆధారిత సేంద్రియ వ్యవసాయం గత మూడెల్లుగా చేస్తున్నానని,ఈ రోజు మంగపేట ఎయివో లు కె.రజిని,ఎ.మహేష్ సందర్శించారని యువరైతు  రాజేష్ తెలిపారు. 

గత మూడు సంవత్సరాలుగా సేం ద్రియ వ్యవసాయం మీద ప్రేమతో తన మూడు ఎకరాల భూమిలో గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నానని తన వ్యవసాయ క్షేత్రంలో ఈ సంవత్సరం రక్తశాలి,నరాయన కామిని,కలాబట్టి,కుషిపటాలియ,హెచ్ యమ్ టి వంటి ఐదు రకాల వరి వంగడాలను నాటు వేసినని,గో ఆధారిత వ్యసాయ ఉత్పత్తుల వలన ఈ ఆహార ఉత్పత్తులు తిన్న వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని,ఫస్టిలేజర్,ఫస్టిసైడ్ వాడడం వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలేత్తుతాయని యువరైతు ఎల్లంకి రాజేష్ అన్నారు.తను సాగు చేస్తున్న వరి సాగు రకాల వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని *రక్తశాలి* వలన రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు వాత,పిత,కఫ సమస్యలు తగ్గుతాయని, *కలాబట్టి(బ్లాక్ రైస్)* తినడం వలన అత్యధికంగవపోషక విలువలు ఉంటాయని,*కుషిపటాలియ* వలన యాంటి యాగ్జిన్స్ పెరగడంతో పాటు గుండె జబ్బు,బిపి షుగర్ రాకుండా నిరోధిస్తుందని ఆసక్తి గల రైతులు ఎవరైనా ఉంటే వారికి శిక్షణ ఇస్తానని ఈ సంధర్బంగా ఎల్లంకి రాజేష్ అన్నారు.

Share it:

Post A Comment: