పినపాక నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్గపోరు
మన్యం మనుగడ, పినపాక:
తెలంగాణ వ్యాప్తంగా దళిత బందు అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత గిరిజన సత్యాగ్రహ దీక్ష, పినపాక మండలం లోని ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డులో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట చేయడం జరిగింది. కానీ పినపాక నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మధ్య ఐక్యత లేకపోవడం కారణంగా, ఢీ అంటే ఢీ అనే విధంగా ఉందని, వర్గ పోరు తప్పదేమోనని సంకేతాలు నిజమే అనిపిస్తున్నాయి. పినపాక మండలంలో సత్యాగ్రహ దీక్ష జరిగినప్పటికీ మండలానికి సంబంధించిన వారు తక్కువ మొత్తంలో హాజరు కావడం, వేరొక మండలానికి చెందిన వారు అధిక సంఖ్యలో హాజరు కావడం అనేది, ఈ అనుమానాలకు తావిస్తోందని విమర్శకుల వాదన. మా మండలానికి సంబంధించిన సత్యాగ్రహ దీక్ష అయినప్పటికీ మాకు తెలియ చేయకపోవడం, అతిథిలా ఆహ్వానించడం ఏమిటని పలువురు వారికి వారే ప్రశ్నించుకుంటున్నారని, సమాచారం. సొంత పార్టీలోనే సఖ్యత లేకుండా, వేరే పార్టీలను ప్రశ్నించే అధికారం ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు.
Post A Comment: