మన్యం టీవీ కరకగూడెం:
మండల ప్రజాపరిషత్ కార్యాలయం నందు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా క్లస్టర్ పెసిలిటేషన్ (CFP)ప్రోగ్రాంపై గ్రామపంచాయతి సర్పంచులకు,సెక్రటరీలకు శనివారం అవగాహన సదస్సు కరకగూడెం మండల ఎంపిపి రేగా కాళిక అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రజలు ఎక్కువగా ఉపయోగించుకున్నారు.కావున ఉపాధి హమీ పుస్తకం అమల్లో ఉన్నవారికి సభ్యులను పెంచాలని,కొత్త వారికి నూతన ఉపాధి హామీ పుస్తకాలు ఏర్పాటు చేయాలని సూచించారు.ఉపాధి హామీ పనిని ఉపయోగించుకున్న వారికి త్వరగా డబ్బులు వచ్చే విధంగా సేక్రటరీ కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యాక్రమంలో కరకగూడెం జడ్పీటీసీ కొమరం కాంతారావు,ఎంపీడీఓ దారవాత్ శ్రీను,ఎపీఓ కృష్ణకుమారి,సర్పంచులు,సేక్రటరీలు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Post A Comment: