మన్యం టీవీ ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీ అయినా ఏటూరునాగారంలో పోలీసులు మేము సైతం కార్యక్రమం ద్వారా సీసీ కెమెరాల ఏర్పాటు,వాటి ఆవశ్యకతపై శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ సట్ల కిరణ్ కుమార్,ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో వివరించారు. ఏటూరునాగారంలో మొత్తం 62 సిసి కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రధాన రహదారులను 12 సర్వే లెన్స్ లైన్లుగా విభజించి " మెయిన్ లైన్ సిసి కెమెరా ప్రాజెక్ట్" గా నామకరణం చేశారు.ఈ ప్రాజెక్టు ను వ్యాపారస్తులు,ప్రజల సహకారంతో పూర్తి చేయనున్నట్లు తెలిపారు.ఇది విజయవంతమైతే మనతో పాటు మన గ్రామంకు రక్షణగా ఉంటుందని,నేరాలు సైతం అదుపులో ఉంటాయని తెలిపారు. ఏటూరునాగారంను 100% నిఘా నీడలో ఉంచడమే తమ లక్ష్యమని తెలిపారు.ఇందుకు వ్యాపారస్తులు,రాజకీయ నాయకులు ముందుకు రావాలని కోరారు.
Post A Comment: