మన్యం టీవీ : జూలూరుపాడు,
ఆగస్టు 1, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని పడమట నర్సాపురం కాలనీలో దామెర్ల నాగమ్మ అనే నిరుపేద మహిళ గత కొన్ని సంవత్సరాలుగా తలపై కనితి ఉండడం తో ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేక వయస్సు పైబడటం తో అనారోగ్యంతో బాధపడుతోంది. విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ నాయకులు లేళ్ళ గోపాలరెడ్డి తన మిత్రులతో కలిసి బాధితురాలిని ఆదివారం పరామర్శించారు. బాధిత మహిళకు తన వంతు ఆర్థిక సహాయంగా 2,000 వేల రూపాయల నగదును, పండ్లను, అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు హరీష్, గఫార్, అబ్బాస్, పటేల్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: