మన్యం టీవీ : జూలూరుపాడు,
ఆగస్టు 1, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ( తెలంగాణ జర్నలిస్టు ఫోరం ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కల్లోజీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లో పనిచేస్తున్న మండలానికి చెందిన 20 మంది వర్కింగ్ జర్నలిస్టులు సభ్యత్వం నమోదు చేసుకొని యూనియన్ అధ్యక్షులు ద్వారా మెంబర్ షిప్ రసీదులు తీసుకున్నారు. ఈ సందర్భంగా (టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ.. మెంబర్ షిప్ తీసుకున్న జర్నలిస్టులకు యూనియన్ అండగా ఉంటుందని తెలిపారు. కరోనా కష్ట సమయంలో ఎంతోమందికి యూనియన్ ద్వారా ఆర్థిక సహాయం అందించామన్నారు. జర్నలిస్టు మిత్రులు అందరూ గ్రామాలలో ఉన్న ప్రజా సమస్యలను తెలుసుకొని, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ఆ సమస్యలను వార్తల రూపంలో అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి పరిష్కరించే విధంగా ప్రజలకు, అధికారులకు, మధ్య వారధిగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టెంజు అధ్యక్షులు వట్టికొండ రవి, టీజేఎఫ్ ఉపాధ్యక్షులు లక్ష్మణ్, సిహెచ్ నరసింహారావు, నాయిని రాజేష్, రెడ్డి, సీనియర్ నాయకులు రామకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు షఫీ, జూలూరుపాడు మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చనుమోలు వెంకన్న, ప్రధాన కార్యదర్శి కొలిపాక చంద్రశేఖర్, గౌరవ సలహాదారు మోదుగు ప్రభాకర్, కోశాధికారి సిహెచ్ నరసింహారావు, ప్రచార కార్యదర్శి, షఫీ, సహాయ కార్యదర్శులు సిద్దిక్, నాగరాజు, బుడన్ పాషా, శ్రీకాంత్, కృష్ణ ప్రసాద్, జస్వంత్, రత్న కుమార్, కొండల్ రావు, రమేష్, యూసుఫ్, సాయి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: