మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం హెచ్ డబ్ల్యు పీ ఎం గౌతమీనగర్ కాలనీ కి చెందిన ప్రైవేట్ సెక్యూరిటి సిబ్బంది కి ప్రముఖ వ్యాపారవేత్త ఎస్ కే టీ గ్రూప్ డైరెక్టర్ దోసపాటి పిచ్చేశ్వర రావు సోమవారం క్రికెట్ కిట్ బహుకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ఉద్యోగం చేస్తూ మానసిక ఒత్తిడి కి గురి అవుతున్న సెక్యూరిటీ సిబ్బందికి ఒత్తిడి తగ్గి మానసిక ఉల్లాసం కోసం క్రీడలు దోహద పడుతాయి అని అందుకు వారికీ 30,000 రూపాయల విలువగల క్రికెట్ కిట్ ఇవ్వడం జరిగిందని అన్నారు. అలాగే మరో రెండు క్రికెట్ బ్యాట్ లను తెరాస మండల అధ్యక్షులు కోడి అమరేందర్ ఇవ్వడం జరిగింది.. తరువాత జరిగిన మ్యాచ్ లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.. ఈ కార్యక్రమం లో జి. ఎస్. రావు మరియు సెక్యూరిటీ ఆఫీసర్ రమణ బాబు, ఫీల్డ్ ఆఫీసర్ యాకుబ్, సూపర్ వైజర్ గద్దల రామకృష్ణ, సుధాకర్, జమీల్, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: