CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మొహరం పండగ ఉత్సవాల్లో పాల్గొన్న అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా

Share it:

 


మన్యం మీడియా ప్రతినిధి/ అన్నపురెడ్డిపల్లి::అన్నపురెడ్డిపల్లి మండలం, ఏర్రగుంట గ్రామంలో నిర్వహించిన మొహరం పండుగ ఉత్సవాల్లో అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఎర్రగుంట గ్రామంలోని గత 50 సంవత్సరాల నుండి మొహరం ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.ఆఖరి రోజున దూదేకుల బజార్లో పీరీలు ఊరేగించి మొహరం ఉత్సవాలను అక్కడ యూత్ సభ్యులు నాగుల్ మీరా, రహీం, ఖాసిం, ఉద్దండు,ఖాన్నయ్య, మైబు హసనయ్యా, అక్బర్,ఇమామ్, బాలు,రహీమద్ తదితరులు ముందుండి ఘనంగా నిర్వహించారు. అక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యే ను గ్రామస్థులు శాలువాతో సత్కరించి స్వాగతించారు. గ్రామస్తులు గ్రామంలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే కు వివరించగా,వారు స్పందిస్తూ గ్రామాలలోని సమస్యలను పరిష్కరించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అని అన్నారు.అనంతరం నున్నా బసవయ్య పీర్ల సావిడి కి మరమ్మతుల నిమిత్తం లక్ష రూపాయలు చెక్కును ఎమ్మెల్యే చేతులమీదుగా అందజేశారు. ఈ మొహరం ఉత్సవాల్లో ఎమ్మెల్యే మెచ్చా వెంట స్థానిక సర్పంచ్ అగ్గి కవిత, టిఆర్ఎస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు, టిఆర్ఎస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండలం ఉపాధ్యక్షులు కొత్తూరు వెంకటేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడు వేముల హరీష్,నున్నా బసవయ్య, అగ్గి రవి, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఘనంగా నిర్వహించారు.

Share it:

Post A Comment: