*👉" మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు"
*👉" మృతుడి కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్"
మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి::అన్నపురెడ్డిపల్లి మండలంలోని కట్టుగూడెం గ్రామంలో ఫారెస్ట్ అధికారుల వేధింపులు, భౌతికదాడి తో మంగళవారం సాయంత్రం పశువులను మేపడానికి వెళ్లిన భాగం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుని కుటుంబాన్ని చండ్రుగొండ మండల జడ్పిటిసి కొడగండ్ల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షులు బాణావత్ భీముడు, ముద్రగడ వెంకటేశ్వర్లు, నాగులుమీరా,యాకుబ్ ఫాష, అహ్మద్,సుభాని ,ప్రసాద్, చల్లా పుల్లయ్య పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారుల దాడులు, వేధింపులు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయని, వారి దౌర్జన్యాలకు అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మృతుని కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, మృతికి కారణమైన ఫారెస్ట్ అధికారుల పై తక్షణమే చట్టరీత్యా చర్యలు తీసుకోని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Post A Comment: