మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి:: అన్నపురెడ్డిపల్లి మండలం,పెంట్లం గ్రామపంచాయతీ, నామవరం గ్రామానికి చెందిన బొగ్గం వీరభద్రం గత నెలలో అనారోగ్యంతో బాధపడుతూ మరణించగా, వారి కుటుంబాన్ని టిఆర్ఎస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ ఆదివాసీ నాయకులు జారే ఆదినారాయణ శుక్రవారం నాడు పరామర్శించి, వీరభద్రం తన క్లాస్మేట్ మరియు మంచి మిత్రుడని జారే వ్యాఖ్యానించారు. ఈ పరామర్శనలో జారే వెంట బేతి బాబురావు, మీడియం బుల్లయ్య, చిన్నబోను వెంకన్న, మాయర శ్రీను, తదితరులు ఉన్నారు.
Post A Comment: