మన్యం టీవీ, అశ్వాపురం:గిరిజన నిరుపేద విద్యార్థి కి దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ చేయూత అందించింది. అశ్వాపురం మండలం కట్టం వారిగూడెం గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి కాకా విజయ లక్ష్మి ఐ ఐ టీ ధన్ బాద్ లో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. చదువు లో మంచి ప్రతిభ కనబరుస్తుంది. ఆన్లైన్ తరగతులకు స్మార్ట్ ఫోన్ కొనే ఆర్థిక స్తోమత లేక పోవటంతో దాత లను ఆశ్రయించింది. దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డైరెక్టర్ దోసపాటి పిచ్చేశ్వర రావు ఈరోజు 3000 ఆర్థిక సహాయం అందజేశారు.
Post A Comment: