ఆందోళనలో స్థానికులు మరియు వాహనదారులు.
మన్యం టీవీ పాల్వంచ:-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లో ఉన్న నవభారత్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రాత్రి పది గంటల ప్రాంతంలో పొగ గొట్టం ద్వారా భారీ అగ్నికీలలు ఆకాశంలో ఎగిసిపడ్డాయి.. దాదాపు అరగంట మండిన అగ్నికీలలతో చుట్టుపక్కల స్థానికులు రోడ్లపై వెళ్లే వాహనదారులు పాదచారులు భయకంపితులయ్యారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి అగ్నికీలలు పొగ గొట్టాల ద్వారా అంత ఎత్తులో ఎగసి పడడం చూడలేదన్నారు స్థానికులు. ఏదేమైనా ప్రజలు భయాందోళనకు గురైన టువంటి ఈ సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
అసలు ఎందుకు అంత ఎత్తున మంటలు వ్యాపించాయి అనే విషయాన్ని జిల్లా అధికారులు తేల్చాల్సి ఉంది.
Post A Comment: