CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గొప్ప వీరయ్య అనే వ్యక్తి ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు

Share it:

 



  మేము నక్షలైట్లం అని చెప్పి నన్ను మా సిబ్బందిని భయ బ్రాంతులకు లోను చేసారు


గొప్ప వీరయ్య మరికొంతమంది సంఘాలు నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు


చట్టపరమైన ఎటువంటి విచారణకు అయినా నేను సిద్ధం అంటున్న

సబ్ రిజిస్టార్ తస్లీమా

మన్యం టీవీ మంగపేట.


19:08:2021 రోజున ములుగు సబ్ రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ 16:08:2021 నాడు వివిధ దిన పత్రికలలో ప్రచురితమైన ములుగు "సబ్ రిజిస్ట్రార్ ను ఉద్యోగం నుండి తొలగించాలి" అనే శీర్షిక పై స్పందిస్తూ మంగపేట మండలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లో ఎలాంటి అవకతవకలు జరగలేదని తస్లీమా అన్నారు. మరియు మన్యసీమ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గొప్ప వీరయ్య నా పై అవగాహన లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తస్లీమా అన్నారు. మంగపేట మండల కేంద్రంలో 107/1 లో 0.20 గుంటల ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని ఎటువంటి విచారణ జరపకుండా రిజిస్ట్రేషన్ చేసినట్లు గొప్ప వీరయ్య తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇంతవరకు అలాంటి సర్వేనెంబర్ మీద ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగలేదని ఆధారాలతో సహా నిరూపిస్తానని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా తెలిపారు. మంగపేట మండలానికి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ రెవిన్యూ మరియు గ్రామపంచాయతీ వారు జారీ చేసిన ఆధారంగా నే రిజిస్ట్రేషన్ చేయడం అయినది అని సబ్ రిజిస్టర్ పేర్కొన్నారు 

గొప్ప వీరయ్య మరికొంతమంది సంఘాలతో కలిసి నాపై నిరాధారమైన పత్రిక ప్రకటనలు ఇస్తూ గత కొన్ని రోజులుగా గొప్ప వీరయ్య మరియు పర్వీన్ లు నక్సలైట్ల మని నన్ను నా సిబ్బందిని ని బెదిరిస్తూ పలుమార్లు నా ఆఫీసు చుట్టూ తిరగడం జరిగింది. అదేవిధంగా కోట్ల రూపాయల లంచం తీసుకున్న ట్లు అభియోగం చేస్తున్నారు ఒకవేళ ఇలాంటివి ఏదైనా ఉంటే ఏసీబీని కానీ చట్టపరమైన విచారణలకు చేపట్టుకోవాలే కాని సామాజిక మాధ్యమాలలో మరియు పత్రికా ప్రకటన చేస్తున్న ఆరోపణలపై పరువు నష్టం మరియు చట్టపరమైన చర్యలకు సైతం వెనుకాడేది లేదని తెలిపారు.

Share it:

Post A Comment: