👉ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిణి ప్రియాంక
మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(ఆగస్టు 06):: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు ప్రియాంక ఆధ్వర్యంలో వైద్య బృందం, అన్నపురెడ్డిపల్లి గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్ర పరిధిలో గల ప్రతి ఇంటిని సందర్శించారు. గ్రామంలో విషజ్వరాల కేసులు నమోదు అవుతున్న తరుణంలో గ్రామంలో పర్యటించి, విష జ్వరాలతో బాధపడుతున్న వారి ఇళ్లను, చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించి, ఖాళీగా ఉంటున్న ఒక ఇంటి ఆవరణంలో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. సీజనల్ వ్యాధులకు కారణమైన దోమల నివారణకు తీమొపాస్ లిక్విడ్ మందును నీటి నిల్వల ఉన్న ప్రదేశాల్లో చెల్లించడం చేశారు. అనంతరం గ్రామంలోని రక్త పరీక్ష కేంద్రం వద్ద విష జ్వరాలతో బాధపడుతున్న వారికి సంబంధించిన వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యురాలు ప్రియాంక మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకుంటూ, నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, అప్పుడే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటారని గ్రామస్తులకు తెలియజేశారు. ఈ సందర్శనలో వైద్యురాలు ప్రియాంక వెంట డిపిఎంవో-ఐ వెంకటేశ్వరరావు, హెచ్వి-బి శారా రాణి, ఎంపీహెచ్ఎ-చంద్రకాంతమ్మ,ఎంపీహెచ్ఎ- టి నాగజ్యోతి, ఆశాలు- కరుణ, నాగమణి, అనురాధ, బేబీ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: