మన్యం టీవీ : జూలూరుపాడు,
ఆగస్టు 6, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల వ్యాప్తంగా ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన స్పూర్తి ప్రదాత, నాలుగు కోట్ల ప్రజలలో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ మలిదశ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత, ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ ఆవశ్యకతను ప్రపంచానికి చాటిన మహోన్నత ఉద్యమ శిఖరం తెలంగాణ సిద్ధాంతకర్త ఉద్యమ స్ఫూర్తి ప్రదాతను ఆ మహనీయుడిని అందరూ స్మరించుకుంటూ నమస్సుమాంజలి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావుడ్యా సోనీ, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎం పి ఓ రామా రావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కృష్ణవేణి, తో పాటు పలు గ్రామ పంచాయతీలలో సర్పంచ్ లు కార్యదర్శులు, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: