భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 29 (మన్యం టీవీ)
శ్రావణ మాస బోనాల సందర్భంగా ఆదివారం సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని కార్మిక ప్రాంతమైన రుద్రంపూర్లో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది శ్రీ శ్రీ శ్రీ గుండాల సాయమ్మ తల్లికి పూజారి రవికుమార్ ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు రుద్రంపూర్ రామాలయం నుండి శ్రీ శ్రీ శ్రీ గుండాల సాయమ్మ తల్లి గుడి వరకు సన్నాయిమేళం తో బయలుదేరి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి అనంతరంభక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పూజారి రవికుమార్ మాట్లాడుతూ అమ్మ ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో, విపత్తుల నుండి వినాశకర జబ్బులనుండి కాపాడాలని అందరు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.
Post A Comment: