మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని కూనవరం గ్రామ పంచాయితీ లో శుక్రవారం వారి కార్య క్రమం లో భాగంగా,సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశాలు వున్న నేపథ్యంలో,జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు,ప్రై డే,డ్రై డే కార్యక్రమం లో కూనవరం సర్పంచ్ ఏనిక. ప్రసాద్,ఆశా వర్కర్లు,ఆంగన్ వాడి కార్య కర్తలతో, కూనవరం లో ఇంటింటి కి వెళ్లి పాత టయర్లు, వాడకంలో లేని వస్తువులలో నిల్వ వున్న నీటిని,ఇంటి వారికి అవగాహన కల్పిస్తూ, వారితో వాటిని తొలగించడం జరిగింది. అలాగే కూనవరం,ఎన్టీఆర్ నగర్,స్కూల్ లో వున్న పిచ్చి మొక్కలను తొలగించి, తరగతి గదులను శుభ్రంగా చెపించి,సైడ్ డ్రైనేజ్ లను శుభ్రం చేపించి బ్లీచింగ్ పౌడర్ ను చల్లించడం జరిగింది.అలాగే జిల్లా క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్ మెంట్ జె ఈ అనిల్ కుమార్, గ్రామ పంచాయితీ లో జరుగుతున్న శానిటేషన్ పనులను,నర్సరీ నీ మరియు రోడ్లను,సైడ్ డ్రైనేజ్ లను,కచ్చా. కాల్వలను,స్కూల్స్ అంగన్వాడీ కేంద్రాలను,హెల్త్ సెంటర్ లను,వాటర్ ట్యాంక్ లను,అవెన్యూ ప్లాంటేషన్ లను పరిశీలించడం జరిగింది.ఈ కార్య క్రమం లో ఆశా వర్కర్ వై.నర్సులమ్మ, అంగనవాడీ కార్య కర్త వి. వీరా కుమారి,గ్రామ పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: