మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(ఆగస్టు 07):: దేశంలో ఫ్యాషన్ విద్యకు మార్గదర్శక సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ( ఎన్ ఐ ఎఫ్ టి) సంస్థ బృందం. అన్నపురెడ్డిపల్లి మండలంలోని నర్సాపురం గ్రామానికి సేర్ప్ ద్వారా విచ్చేసి మేదర కులస్తులు నాన్ ఫామ్ యూనిట్ కి సంబంధించి వెదురుతో తయారు చేస్తున్న ఉత్పత్తులను పరిశీలించారు. మేదర్ కులస్తులు చేతి వృత్తి తో తయారుచేసిన బుట్టలు, గంపలు, చాటలు, వివిధ రకాల వెదురు ఉత్పత్తులను మూడు రోజుల నుండి పరిశీలించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ బృందం ప్రొఫెసర్లు చిరంజీవి రెడ్డి, కిషోర్, రాజు. మేదర్ కులస్తుల తో మాట్లాడుతూ వారి యొక్క నైపుణ్యాలను పెంచుకుంటూ, గృహ అలంకరణకు ఉపయోగించే ఉత్పత్తులను కూడా తయారు చేసి, పట్టణాలకు తీసుకు వెళితే మార్కెటింగ్ అవకాశాలు కూడా పెరుగుతాయి అని. ఎక్కువ ఉత్పత్తులను తయారు చేయాలంటే యంత్ర పరికరాలను ఉపయోగిస్తే అది సాధ్యమవుతుందని, ఉత్పత్తులు తయారు చేసేందుకు కావలసిన పచ్చి వెదురు దొరకనందున వారి యొక్క సొంత భూమిలో వెదురు క్రాఫ్ పెంచుకోవడం చాలా మంచిదని, అందువలన ఉత్పత్తులు తయారుచేసేందుకు కొరత ఉండదని వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ డిపిఎం-నాగజ్యోతి,అన్నపురెడ్డిపల్లి ఏపిఎం-రామభద్రయ్య,నరసాపురం సర్పంచ్-ఎన్ రాములు, సిసి-శ్రావణి, నరసాపురం విఓఏ-నాగేశ్వరరావు, సిఆర్పి-రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: